Posts

Showing posts with the label Scientific temper

జాతకాలు చెప్పుకుని బతికిన సైంటిస్ట్ - టైకో బ్రాహి

 జ్యోతిషం వేరు, ఖగోళ శాస్త్రం వేరు. ఒకప్పుడు సైంటిస్టులు కూడా జ్యోతిషాన్ని నమ్మేవాళ్ళు, కొంత మంది సైంటిస్టులు జాతకాలు చెప్పుకుని బతికేవాళ్ళు కూడా. అలాంటివాళ్ళలో ఒకడు టైకో బ్రాహి. సూర్య గ్రహణం ప్రతి 177 రోజులు 4 గంటలకి ఒకసారి జరుగుతుంది. కొన్ని సార్లు సంవత్సరానికి ఐదు సూర్య గ్రహణాలు జరుగుతాయి కానీ అలాంటి సంవత్సరాలు గత ఐదు వేల సంవత్సరాల కాలంలో 25 మాత్రమే. ప్రతి గ్రహణం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. జ్యోతిషులు వేరే దేశాల్లో కనిపించిన గ్రహణాల రెకార్డులు సంపాదించి గ్రహణాలు ఎప్పుడొస్తాయో చెప్పగలుగుతుంటారు. ఈ విషయం తెలియక జనం జ్యోతిషులని అపర మేధావులు అనుకుంటారు. గ్రహణాలు చూడకూడదని మనం నమ్ముతాము కానీ జ్యోతిషులు గ్రహణాలు చూస్తారు. ఒక రోజు టైకో బ్రాహి సూర్య గ్రహణం చూస్తున్నప్పుడు గ్రహణాలు సైక్లికల్‌గా జరుగుతుంటాయని అతనికి డౌట్ వచ్చింది. అతను వేరే దేశాల్లో కనిపించిన గ్రహణాల రెకార్డుల్ని సంపాదించి గ్రహణాలు ఎప్పుడు వస్తాయో చెప్పడం మొదలుపెట్టాడు. ఒక రోజు అతను తురక చక్రవర్తి సులేమాన్ చంద్ర గ్రహణం రోజు చస్తాడని జాతకం చెప్పాడు. అప్పట్లో యూరోపియన్ రాజులకీ, తురక సామ్రాజ్యవాదులకీ మధ్య యుద్ధా...

కథని కథలా మాత్రమే చూడాలనే సెన్స్ లేని యూనివర్సిటీ ప్రొఫెసర్లు మనకి సైన్స్ నేర్పిస్తున్నారు

  ఇస్రొ సైంటిస్ట్ వి. శ్రీనివాస చక్రవర్తి గారు చెప్పినట్టు గుర్తింది, "కాన్స్టెలేషన్స్ (నక్షత్ర మండలాలు) ఊహాజనితం, చంద్రుడి మీద నుంచి చూస్తే కాన్స్టెలేషన్స్ వేరే ఆకారంలో కనిపిస్తాయి" అని. ఇంత తెలిసిన సైంటిస్టులు కూడా సైన్స్ తెలియని పంతులు పెట్టిన ముహూర్తం ప్రకారం పెళ్ళి చేసుకుంటున్నారు. అలాంటప్పుడు ఇంత సైన్స్ తెలుసుకుని ఏమి లాభం? ప్రపంచం మొత్తం పదార్థంతో నిర్మితమైనది. మరి పదార్థం కాని దేవుణ్ణి సైంటిస్టులు ఎలా నమ్ముతున్నారు? ఈ సందేహం చాలా మంది హేతువాదుల్లో ఉంది. గాజులు బానిసలకి వేసిన చేతి సంకెళ్ళ నుంచి పరిణామం చెందాయని చాలా మంది స్త్రీవాద రచయిత్రులకి తెలియదు. స్త్రీవాద రచయిత్రులు కూడా చేతులకి గాజులు తొడుక్కుని మీటింగ్‌లలో స్త్రీ-పురుష సమానత్వం గురించి మాట్లాడుతారు. హిందు పురాణాల్లోనూ, బైబిల్‌లోనూ నక్షత్రాలు మాట్లాడుతున్నట్టు, నడుస్తున్నట్టు కథలు ఉన్నాయి. కథలు వేరు, వాస్తవం వేరు అని సైంటిస్టులు అంటారు కానీ ఆ కథలు ఎందుకు రాసారో సైంటిస్టులకి తెలియదు. పెన్మెత్స సుబ్బరాజు అనే హేతువాది అన్నారు "సైంటిస్టులు తమ రంగంలో మాత్రమే మేధావులు, తమ రంగం బయట వాళ్ళకి సాధారణ జనంతో సమానమైన తెల...