Posts

Showing posts with the label Hypocrisy

ప్రోపగాండా భాష మాట్లాడితే మిమ్మల్ని తింగరోళ్ళు అనుకుంటారు

జైలులో కైదీని లోపల పెట్టే ముందు జైలు సూపరింటెండెంట్ కైదీకి కులం పేరు అడుగుతాడు. అతను "ఈ రోజుల్లో కులాలు లేవు" అనో, "నేను నాస్తికుణ్ణి కనుక నాకు కులం వర్తించదు" అనో చెపితే అతన్ని తింగరోడు అనుకుంటారు. పెళ్ళి సంబంధం కోసం వెళ్ళినప్పుడు "మీది ఏ కులం?" అని అడుగుతారు తప్ప "మీది ఏ సామాజిక వర్గం?" అని అడగరు. "మాది ఫలానా సామాజిక వర్గం" అని చెప్పుకున్నా విచిత్రంగా చూస్తారు. ప్రోపగాండా భాష మాట్లాడితే ఇలాగే నవ్వులపాలు అవుతాము. నేను జైలులో ఉన్నప్పుడు నేను ఉండిన సెల్‌లో ఒక కోమటోడు, ఒక బాపనోడు ఉండేవారు. ఆ సెల్‌లో ఎక్కువ మంది పేదవాళ్ళు. ఆ బాపనోడు ఆస్తి ఎక్కువ ఉన్నవాడే. అతను పాక్సో కేసులో జైలుకి వచ్చాడు. జైలులో డబ్బున్నవాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ ఉండదు కాబట్టి అతను పంచముల పక్కనే పడుకున్నాడు, వాళ్ళ పక్కనే కూర్చుని తిన్నాడు. జైలు నుంచి విడుదల అయిన తరువాత అతను తన కులంవాళ్ళ ఇంటిలోనే తింటాడు తప్ప పంచముల పక్కన కూర్చుని తినడు. ఇండియాలోని జైళ్ళలో దళితులు & ముస్లింల సంఖ్య ఎక్కువగా ఉంది. వీళ్ళు లాయర్ ఫీజ్ కట్టలేకపోవడం వల్ల వీళ్ళకి బెయిల్ రావడం లేదు. ఈ విషయం జై...

అవినీతి వ్యతిరేక ఉద్యమకారులు చెప్పే టాక్స్ లెక్కలు మేడి పండు, పొట్ట విప్పితే పురుగులు

Image

మశూచి ఉన్నవాడికే అవసరం లేని ఎసి మామూలు చర్మ రోగం ఉన్నవాడికి అవసరమా?

 కైదీకి మశూచి లేదా ప్లేగ్ లాంటి భయంకరమైన రోగం వస్తే అతన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోని అంటు రోగాల వార్డ్‌కి పంపించేస్తారు తప్ప ఎసి రూమ్‌లో పెట్టరు. చంద్రబాబు నాయుడికి వచ్చింది మామూలు చర్మ రోగం. దాని కోసం అతనికి అత్తవారి ఇంటిలాగ ఎసి పెట్టడం అవసరమా? చట్టం ముందు అందరు సమానం కాదని బాగానే నిరూపించారు. ఒడిశా జైల్‌లలో ఒకప్పుడు కైదీలకి ఉప్పుడు బియ్యంతో చేసిన ఇచ్చేవాళ్ళు. ఉప్పుడు బియ్యపు అన్నం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తినగలం. బియ్యం రేట్ బాగా పెరిగిన తరువాత జైల్ కేంటీన్ కంట్రాక్టర్లు రూపాయి బియ్యం బ్లాక్‌లో కొని వండి కైదీలకి పెట్టడం మొదలు పెట్టారు. మా ఊరిలో లబ్దిదారులు బ్లాక్‌లో అమ్ముకునే బియ్యం బ్రహ్మపురం సెంట్రల్ జైల్‌కి కూడా వెళ్తుంది. నా పొలంలో పని చేసే ట్రాక్టర్ డ్రైవరే ఊరివాళ్ళ దగ్గర బ్లాక్‌లో బియ్యం కొని పక్క ఊరి సాహుకార్లకి ఇస్తాడు, ఆ సాహుకార్లు ఆ బియ్యాన్ని జైల్ కేంటీన్లకి, హాస్టల్ కేంటీన్లకి సప్లై చేస్తారు. జైలులోని కైదీలందరు రూపాయి బియ్యం తినాలి, ఒక మాజీ ముఖ్య మంత్రి మాత్రం ఇంటిలో వండిన ఆహారం జైలుకి తెప్పించుకోవాలి అన్నప్పుడే చట్టం ముందు సమానత్వం మీద డౌట్ రాలేదా?

మూడెకరాల రైతు - వాయిదాకి కోటికి పైగా తీసుకునే లాయర్లు

Image
 చంద్రబాబు నాయుడు ఎలెక్షన్ వచ్చినప్పుడు తాను మూడెకరాల రైతునని చెప్పుకునేవాడు. గెలిచిన తరువాత వ్యవసాయం వేస్టు అనేవాడు. ఐ.టి., టూరిజం తప్ప ఏదీ అవసరం లేదు అనేవాడు. మళ్ళీ ఎలెక్షన్ టైమ్‌కి తాను మూడెకరాల రైతునని చెప్పుకునేవాడు. ఇప్పుడు స్కిల్ డెవెలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు లాయర్ తన లాయర్‌కి కట్టే ఫీజ్ వాయిదాకి కోటి రూపాయలు పైనే. కంటెస్ట్ ఫీజ్ ఎన్ని కోట్లో చెప్పలేదు. మూడెకరాల రైతు ఇంత ఖరీదైన లాయర్‌లని పెట్టుకుంటాడంటే ఏ చెవిలో పువ్వు పెట్టుకున్నవాడు నమ్మాలి? నాకు అర ఎకరం చెరువు కలిపి మూడెకరాల భూమి ఉంది. 57 సెంట్ల భూమి గొడవలో నేను ఒక వ్యక్తి మీద పెప్పర్ స్ప్రే కొట్టాను. ఆ కేస్‌లో నాకు బెయిల్‌కి పది వేలు, వాయిదాకి వెయ్యి, అక్యూజ్డ్ స్టేట్మెంట్‌కి పాతిక వేలు తీసుకున్నాడు మా లాయర్. ఆ ఫీజ్ మా అమ్మే కట్టింది, ఆవిడ రిటెయిర్డ్ బ్యాంక్ ఆఫీసర్ కావడం వల్ల. మూడెకరాల భూమి ఉన్నవాడు ఇంత కంటే ఖరీదైన లాయర్ దగ్గరకి వెళ్ళడు.

నేను బీఫ్ తింటాను, అహింసావాదులకి దమ్ముంటే నన్ను మర్డర్ చేసుకోవచ్చు